తెలంగాణలో 3,325 సెకండరీ గ్రేడ్ ఉపాద్యాయుల భర్తీకి సంబందించి తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. రెండేళ్ళ క్రితం 3,768 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి 2018లో పరీక్షలు నిర్వహించింది. అప్పుడే ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం ఫలితాలు ప్రకటించినప్పటికీ కొందరు అభ్యర్ధులు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించడంతో తుది ఫలితాలు ప్రకటించడంలో చాలా ఆలస్యమైంది. కోర్టులో ఆ సమస్యలు పరిష్కారం అవడంతో సెకండరీ గ్రేడ్ తెలుగు మీడియం ఉపాద్యాయులుగా ఎంపికైన 3,325 మంది జాబితాను టీఎస్పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. ఏజన్సీ ప్రాంతంలో 117 పోస్టుల భర్తీ విషయంలో ఇంకా న్యాయవివాదాలు కొనసాగుతున్నందున వాటిని ప్రకటించలేదు. వికలాంగుల కేటగిరీలో 270 పోస్టులకు సంబందించి తుది ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ తెలియజేసింది. ఈ ఫలితాల పూర్తి వివరాలను టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైటులో చూడవచ్చు.