త్వరలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు

August 16, 2019
img

గురువారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ, “మరొక వారం రోజులలోపుగా గ్రూప్-2 ఇంటర్వ్యూలు పూర్తవుతాయి. కాగానే ఫలితాలు వెల్లడించబోతున్నాము. వాటితో కలిపి టీఎస్‌పీఎస్సీ అధ్యవర్యంలో ఇంతవరకు 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లవుతుంది. వైద్యఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ న్యాయవివాదాల కారణంగా ఆలస్యం జరుగుతోంది. త్వరలోనే అవి పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాము,” అని చెప్పారు. 


Related Post