టీఆర్టీ-2017 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్ధులకు శుభవార్త. ఈనెల 13,14 తేదీలలో వారు నియామకపత్రాలు అందుకొని 15వ తేదీ నుంచి ఉద్యోగాలలో చేరబోతున్నారు. దీనికి సంబందించి పాఠశాల విద్యాకమీషనర్ టి.విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బుదవారం నుంచే టీఆర్టీ తుది కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలుకాబోతోంది. టీఆర్టీ ఉద్యోగ నియామకాల షెడ్యూల్ ఈవిధంగా ఉంటుంది.
10-7-2019 : జిల్లాల వారీగా ఎంపికైన అభ్యర్ధుల జాబితాలను పత్రికలలో ప్రకటిస్తారు. ఆదేరోజున జిల్లాలవారీగా వివిద పాఠశాలలో ఖాళీల సంఖ్యను కూడా పత్రికలలో ప్రకటిస్తారు.
11-7-2019: అర్హత సాధించిన అభ్యర్ధుల సర్టిఫికేట్లు పరిశీలన.
13,14-7-2019: అభ్యర్ధులకు నియామక పత్రాలు అందజేయబడతాయి.
15-7-19: నియామక పత్రాలు అందుకున్నవారు తమకు కేటాయించిన పాఠశాలలో రిపోర్టింగ్ చేయాలి.
17-7-2019: రిపోర్టింగ్ చేయనివారి జాబితాను డీఈఓలు రూపొందిస్తారు.
18-7-2019: రూల్ నెంబర్ 5 ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరుకాని అభ్యర్ధులకు రిజిస్టర్ పోస్టు ద్వారా నియామకపత్రాలు జారీ.
19-7-2019: విధులలో చేరిన కొత్త ఉపాద్యాయుల జాబితాను హెచ్.ఎంలు డీఈఓలకు సమర్పించాలి. అదే రోజున డీఈఓ వెబ్సైట్లో వారి జాబితాను ఉంచుతారు.
20-7-2019: రిపోర్టింగ్ చేయనివారి, రిపోర్టింగ్ చేసినా విధులలో చేరనివారి జాబితాలను జిల్లాలవారీగా సిద్దంచేసి టీఎస్పీఎస్సీకి, పాఠశాల విద్యాశాఖ కమీషనర్కు సమర్పించబడుతాయి.