గురువారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఇనతేర్మీడియెట్ పరీక్షా ఫలితాలను ప్రకటించబోతున్నామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి నిన్న తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,42,719 మంది విద్యార్దులు ఇంటర్ పరీక్షలు వ్రాశారు. వారిలో 4,52,550 మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు కాగా 4,90,169 మంది సెకండ్ ఇయర్ విద్యార్ధులు. ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలు అధికారికంగా వెలువడిన తరువాత ఈ క్రింద పేర్కొన్న వెబ్సైట్లలో మరియు అన్ని ప్రముఖ తెలుగు దినపత్రికల ఆన్లైన్ ఎడిషన్లో చూసుకోవచ్చు.