కూకట్ పల్లిలో ఇద్దరు చిన్నారులు మృతి

August 02, 2018
img

కూకట్ పల్లిలో ఒక స్కూలు గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక న్యూ సెంచరీ స్కూల్లో ఈరోజు సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. పిల్లలు కరాటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గోడ హటాత్తుగా కూలిపోవడంతో నాలుగవ తరగతి చదువుతున్న చందన, మహికృష్ణ అనే ఇద్దరు విద్యార్ధులు దాని క్రింద నలిగి చనిపోయారు. సందీప్, నరేష్, నిఖిత, దేవీశ్రీ అనే మరో నలుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్ధులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యపరిస్థితి గురించి సమాచారం ఇంకా తెలియవలసి ఉంది. 

ఈ ప్రమాదం సంగతి తెలుసుకొన్న పిల్లల తల్లితండ్రులు స్కూలు వద్దకు పరుగున వచ్చి తమ పిల్లలను వెతుకొంటుంటే మరోపక్క చనిపోయిన, గాయపడిన పిల్లల తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంగతి తెలుసుకొన్న జి.హెచ్.ఎం.సి.డిప్యూటీ కమీషనర్ అక్కడకు చేరుకొని స్కూలును సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. స్కూలు యజమాని భయంతో పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతని కోసం గాలిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు బలహీనపడిన గోడ దురదృష్టవశాత్తు పిల్లలపై కూలిపోవడంతో అన్యాయంగా ఇద్దరు పిల్లలు బలైపోయారు.

Related Post