టీచర్ల బదిలీ సాగుతూనే ఉంది..

July 07, 2018
img

రాష్ట్రంలో ఉపాద్యాయుల బదిలీల ప్రక్రియ మొదలై దాదాపు నెలరోజులపైనే అయ్యింది. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి కూడా. కానీ ఉపాద్యాయుల బదిలీల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది మరొక వారంరోజులు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. 

హైకోర్టు ఆదేశానికి అనుగుణంగా టీచర్లను బదిలీలు చేసే అధికారం డీఈఓలకు బదులు ఆర్.జె.డి.లకు కట్టబెడుతూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనుక ఈరోజు (శనివారం) సాయంత్రంలోగా స్కూల్ అసిస్టెంట్స్, ఎస్.జి.టిల బదిలీల దరఖాస్తులు పరిశీలించి బదిలీ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బదిలీ ఉత్తర్వులు అందిన వారం రోజులలోపుగా వారు విధులలో చేరవలసి ఉంటుంది. అంటే అన్నీ సవ్యంగా సాగితే మరొకవారం రోజులలోపుగా ఈ ప్రక్రియ ముగియవచ్చు.

Related Post