తెలంగాణా గురుకుల డిగ్రీ కళాశాలలో 616 లెక్చరర్ పోస్టులు,15 ప్రిన్సిపాల్ పోస్టులతో సహా మొత్తం 863 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరుచేసింది. ఈ ఉద్యోగాలను టి.ఎస్.పి.ఎస్.సి. ద్వారా కాక గురుకులబోర్డు ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి లభించింది కనుక త్వరలోనే దీనికి సంబందించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.