జూన్ 15లోగా నోటిఫికేషన్ పక్కా!

May 12, 2018
img

నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణా గురుకుల సంక్షేమ పాఠశాలలలో 4,500 టీచర్ పోస్టులకు జూన్ 15వ తేదీ లోగా నోటిఫికేషన్ విడుదల చేయాలని గురుకులాల సొసైటీ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్ణయించిందని సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే ఆర్ధికశాఖ అనుమతి రాగానే నోటిఫికేషన్ జారీ అవుతుందని తెలిపారు. నోటిఫికేషన్ జారీ చేయడానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. 


Related Post