గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో అధ్యాపకులు, ప్రిన్సిపల్ ఉద్యోగాలకు, ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల కోసం టి.ఎస్.పి.ఎస్.సి. బుధవారం పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. ఆ వివరాలు:
ప్రధాన పరీక్షలు: మే12 నుంచి 17 వరకు
జూనియర్, డిగ్రీ కాలేజీల లైబ్రేరియన్ ఉద్యోగాలకు: మే 12న పరీక్ష జరుగుతుంది.
జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలకు: మే 13న.
గురుకుల ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు: మే 14న.
జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు: మే 15న.
జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ఉద్యోగాలకు: మే 16న.
డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఉద్యోగాలకు: మే 17న ప్రధాన పరీక్ష నిర్వహించబడుతుందని టి.ఎస్.పి.ఎస్.సి. ప్రకటించింది.
ఈ పరీక్షల ద్వారా మొత్తం 1,099 పోస్టులు భర్తీ చేస్తుంది. విశేషమేమిటంటే, గత ఏడాది సెప్టెంబర్ 10న జరిగిన ప్రాధమిక పరీక్షకు హాజరైన వారిలో కేవలం 6,521మంది మాత్రమే ఎంపికయ్యారు. అంటే పోటీ చాలా తక్కువగా ఉందన్న మాట. ఒక్కో పోస్టుకు కేవలం ఆరుగురు మాత్రమే పోటీ పడుతున్నారు. ఈ అవకాశాన్ని చేజార్చుకొంటే మళ్ళీ ఇటువంటి అవకాశం ఎన్నడూ రాకపోవచ్చు. కనుక ఈ ప్రధాన పరీక్షకు హాజరవుతున్న అభ్యర్ధులు అందరూ ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వోద్యోగం సంపాదించుకొనేందుకు గట్టి ప్రయత్నం చేయాలి.