బిసి యువతకు రాయితీ రుణాలు..రేపే ఆఖరు రోజు

April 03, 2018
img

రాష్ట్రంలో బిసి నిరుద్యోగ యువతను పారిశ్రామిక, వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు బిసి కార్పోరేషన్ వారికి రాయితీ రుణాలు అందిస్తోంది. 21-25 ఏళ్ళు వయసు కలిగి సం.నికి రూ.2 లక్షలలోపు వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారు ఈ రాయితీ రుణాలకు అర్హులని ఆ శాఖ అధికారిని ఎంబికే మంజుల తెలిపారు. ఆసక్తి కలిగినవారు ఏప్రిల్ 4వ తేదీలోగా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం https://tsobmms.cgg.gov.in/ వెబ్ సైట్ లో లభిస్తాయని తెలిపారు. ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది కనుక అర్హులైన యువతీయువకులు తక్షణమే దరఖాస్తు చేసుకోవడం మంచిది. 


Related Post