తెలంగాణా విద్యార్ధినికి జీతం: రూ.38 లక్షలు

February 14, 2018
img

ఇటీవల భువనేశ్వర్ ఐఐటిలో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్ లో తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఆర్.లిఖిత శర్మ అనే విద్యార్ధిని ఎంపికయింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఎడోబ్ కంపెనీలో ఆమె ఉద్యోగం సాధించింది. ఆమెకు ఏడాదికి రూ.38 లక్షలు జీతం ఇవ్వబోతోంది. అంటే నెలకు 3.16 లక్షలు జీతం అన్నమాట! డిల్లీ, చెన్నై, ముంబై, రూర్కీ, గౌహతీ ఐఐటిలలో చదువుకొంటున్న విద్యార్ధులకు ఇంత జీతాలతో ఉద్యోగాలకు ఎంపికవడం సాధారణమైన విషయమే. కానీ భువనేశ్వర్ ఐఐటి విద్యార్ధిని ఇంత బారీ జీతం సాధించడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఒక విద్యార్ధికి ఏడాదికి రూ.34 లక్షల జీతంతో ఉద్యోగం సంపాదించుకొన్నాడని, ఈ ఏడాది ఆ రికార్డును లిఖిత శర్మ అధిగమించారని ఐఐటి- భువనేశ్వర్ డైరెక్టర్ ఆర్.వి. రాజకుమార్ తెలిపారు. లిఖిత శర్మకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. 


Related Post