ఎన్.పి.డి.సి.ఎల్. (నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్) లో గల 800 జూనియర్ లైన్ మ్యాన్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆ సంస్థ సి.ఎం.డి. అన్నమనేని గోపాల్ రావు చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లాలో నర్సంపేటలో గల తమ సంస్థ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన అయన ఉద్యోగులను ఉద్దేశ్యించి మాట్లాడినప్పుడు ఈ విషయం తెలియజేశారు. ఇప్పటికే 108 అసిస్టెంట్ ఇంజనీర్లను తీసుకొని వారిని అవసరమైన శిక్షణ కార్యక్రమాలకు పంపించామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం జరుగుతున్న కృషిలో పై నుంచి క్రిందవరకు అందరూ యధాశక్తిన తోడ్పడాలని ఆయన కోరారు.