ఫిబ్రవరి 5న కరీంనగర్ లో కేంపస్ సెలక్షన్స్

February 03, 2018
img

ఫిబ్రవరి 5న కరీంనగర్ లో వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో కేంపస్ సెలక్షన్స్ జరుగబోతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐహెచ్ బిఏ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సి-3 హెల్త్ కేర్ సొల్యూషన్స్ కంపెనీలు తమ సంస్థలలో ఖాళీలను భర్తీ చేసుకోవడానికి వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఏ ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్దులైనా ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్ధుల దరఖాస్తులు స్వీకరించి, వారిలో అర్హులైనవారిని ఎంపిక చేసుకొంటాయని వాగేశ్వరి విద్యాసంస్థల చైర్మన్ జి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి కాపీలు, బయోడేటా, రెండు ఫోటోలు తీసుకొని రావాలని తెలిపారు. కాలేజీ ఆడిటోరియంలో తొలుత వ్రాత పరీక్ష, దానిలో పళనిస్వామి అయినవారికి గ్రూప్ డిస్కషన్, ఓరల్ ఇంటర్వ్యూలు ఉంటాయని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన అభ్యర్ధులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.             


Related Post