ఇవాళ్ళ సాయంత్రం 6 గంటలకు ఓల్డ్ మలక్పేట డివిజన్లో రీపోలింగ్ పూర్తవగానే రెండు మీడియా సంస్థలు తమ సర్వే ఫలితాలను (ఎగ్జిట్ పోల్స్) ప్రకటించాయి. రెండూ కూడా టిఆర్ఎస్కే విజయావకాశాలున్నాయని తేల్చి చెప్పాయి. అయితే టిఆర్ఎస్ భావిస్తున్నట్లు 100 సీట్లు కాక ఈసారి కేవలం 68-78 సీట్లు మాత్రమే గెలుచుకొంటుందని జోస్యం చెప్పాయి. ఈసారి బిజెపి తప్పకుండా గెలవాలని చాలా పట్టుదలగా ప్రయత్నించినప్పటికీ 25-35 సీట్లు మాత్రమే గెలుచుకోవచ్చునని రెండు సంస్థలు జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 2-5 డివిజన్లు మాత్రమే గెలుచుకొనే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. అంటే ఈ దెబ్బతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారబోతోందని భావించవచ్చు. మజ్లీస్ పార్టీకి 38-42 డివిజన్లు గెలుచుకొనే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టిఆర్ఎస్-బిజెపి-మజ్లీస్ ముక్కోణపు పోటీలో ఇతరులెవరికీ ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని స్పష్టం చేశాయి.
రేపు ఉదయం 8.30 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలలోపుగా జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించబోతోందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
|
ఆరా |
||||
|
టిఆర్ఎస్ |
బిజెపి |
కాంగ్రెస్ |
మజ్లీస్ |
ఇతరులు |
ఓట్ షేర్ |
40.0 శాతం (+/-) 3% |
31.21 శాతం (+/-) 3% |
8.58 శాతం (+/-) 3% |
13.43 శాతం (+/-) 3% |
7.70 శాతం (+/-) 3% |
గెలుచుకోబోయే డివిజన్లు/సీట్లు |
78 (+/-) 7 |
28 (+/-) 5 |
03 (+/-) 3 |
41 (+/-)5 |
0 |
|
పీపుల్స్ పల్స్ |
||||
గెలుచుకోబోయే డివిజన్లు/సీట్లు |
68-78 |
25-35 |
1-5 |
38-42 |
0 |