గ్రేటర్ ఎన్నికలలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే...

December 03, 2020


img

ఇవాళ్ళ సాయంత్రం 6 గంటలకు ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్ పూర్తవగానే రెండు మీడియా సంస్థలు తమ సర్వే ఫలితాలను (ఎగ్జిట్ పోల్స్) ప్రకటించాయి. రెండూ కూడా టిఆర్ఎస్‌కే విజయావకాశాలున్నాయని తేల్చి చెప్పాయి. అయితే టిఆర్ఎస్‌ భావిస్తున్నట్లు 100 సీట్లు కాక ఈసారి కేవలం 68-78 సీట్లు మాత్రమే గెలుచుకొంటుందని జోస్యం చెప్పాయి. ఈసారి బిజెపి తప్పకుండా గెలవాలని చాలా పట్టుదలగా ప్రయత్నించినప్పటికీ 25-35 సీట్లు మాత్రమే గెలుచుకోవచ్చునని రెండు సంస్థలు జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 2-5 డివిజన్‌లు మాత్రమే గెలుచుకొనే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. అంటే ఈ దెబ్బతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారబోతోందని భావించవచ్చు. మజ్లీస్‌ పార్టీకి 38-42 డివిజన్‌లు గెలుచుకొనే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టిఆర్ఎస్‌-బిజెపి-మజ్లీస్‌ ముక్కోణపు పోటీలో ఇతరులెవరికీ ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని స్పష్టం చేశాయి. 

రేపు ఉదయం 8.30 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలలోపుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించబోతోందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

ఆరా

 

టిఆర్ఎస్‌

బిజెపి

కాంగ్రెస్‌

మజ్లీస్‌

ఇతరులు

ఓట్ షేర్

40.0 శాతం

(+/-) 3%

31.21 శాతం

(+/-) 3%

8.58 శాతం

(+/-) 3%

13.43 శాతం

(+/-) 3%

7.70 శాతం

(+/-) 3%

గెలుచుకోబోయే డివిజన్‌లు/సీట్లు

78 (+/-) 7

28 (+/-) 5

03 (+/-) 3

41 (+/-)5

0

 

పీపుల్స్ పల్స్

గెలుచుకోబోయే డివిజన్‌లు/సీట్లు

68-78

25-35

1-5

38-42

0



Related Post