వర్షం కారణంగా నిన్న సిఎం కేసీఆర్ హుజూర్నగర్ పర్యటన రద్దయిన సంగతి తెలిసిందే. దానిపై కాంగ్రెస్ నేత విజయశాంతి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. “హుజూర్నగర్కు వస్తే ప్రజలు ఆర్టీసీ సమ్మె గురించి ప్రజలకు సంజాయిషీ చెప్పవలసి వస్తుందనే భయంతోనే సిఎం కేసీఆర్ వర్షం సాకు చూపి హుజూర్నగర్ పర్యటన రద్దు చేసుకొన్నారు. హెలికాఫ్టర్లో రావడానికి ఇబ్బందయితే రోడ్డు మార్గంలో రావచ్చు కదా? కానీ రాలేదు. అంటే సిఎం కేసీఆర్ ప్రజల మద్యకు రావడానికి భయపడుతున్నారని అర్ధం అవుతోంది. ఆర్టీసీ సమ్మె పట్ల సిఎం కేసీఆర్ మొండి వైఖరి పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే సంగతి ఆయన కూడా గ్రహించారు. హుజూర్నగర్లో కాంగ్రెస్ చేతిలో తెరాస ఓటమి ఖాయం. సిఎం కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకోవడం ద్వారా ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించారు. ఈ ఉప ఎన్నికలు ఆయనకు గుణపాఠం కాబోతున్నాయి,” అని అన్నారు విజయశాంతి.