లోక్సభ ఎన్నికల సమయంలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే ‘సారు...కారు...సర్కారు..’ డైలాగ్ వినిపిస్తుంటే దానిలో ఆంతర్యం ఏమిటా అనుకునే దానిని. కానీ అదేమిటి ఇప్పుడు అర్ధం అయ్యింది,” అంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ట్వీట్ చేశారు. కేసీఆర్ తనను తాను రాజులా భావించుకుంటూ యదాద్రి ఆలయంలో దేవతామూర్తుల బొమ్మలతోపాటు తన బొమ్మను, తన పార్టీ చిహ్నాలను చెక్కించుకున్నారు,” అంటూ చాలా ఘాటుగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఈ అంశంపై కేసీఆర్ను ఉద్దేశ్యించి విజయశాంతి ఏమన్నారో స్వయంగా ఆమె మాటలలోనే...