ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

July 20, 2019


img

మోడీ సర్కార్ శనివారం ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. వారిలో యూపీకి ఆనందీ బెన్, మధ్యప్రదేశ్‌కు లాల్‌జీ టండన్, బీహార్‌కు ఫగు చౌహాన్, పశ్చిమబెంల్‌కు జగదీప్ ధన్కర్, త్రిపురకు రమేశ్ బయాస్, నాగాల్యాండ్‌కు ఆర్‌న్‌ రవిని గవర్నర్లుగా నియమించింది. 

యూపీకి గవర్నరుగా నియమితులైన ఆనందీ బెన్ ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ గవర్నరుగా, అదేవిధంగా మధ్యప్రదేశ్ గవర్నరుగా నియమితులైన లాల్‌జీ టండన్ ఇప్పటి వరకు బీహార్ గవర్నరుగా వ్యవహరించారు. త్వరలోనే కొత్త గవర్నర్లు భాద్యతలు స్వీకరిస్తారు. అయితే తెలంగాణ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్‌ను ఈసారి కూడా కదపకపోవడంతో ఆయనే మరికొంత కాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఏపీ గవర్నరుగా నియమితులైన బిశ్వభూషన్ హరిచందన్‌ ఈ నెల 24న బాధ్యతలు స్వీకరించబోతున్నారు.


Related Post