తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షపార్టీ డిఎంకె అధినేత స్టాలిన్తో సిఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. అయంతో పాటు తెరాస ఎంపీలు వినోద్ కుమార్, సంతోష్ కుమార్ కూడా భేటీలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు, తదనంతర పరిణామాలపై వారు చర్చించారు. ఈసారి కాంగ్రెస్, బిజెపిలు రెండూ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కనుక ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే త్రాటిపైకి వస్తే వాటికి ప్రత్యామ్నాయశక్తిగా నిలువవచ్చని, కనుక ఫెడరల్ ఫ్రంట్లో భాగస్వామిగా చేరాలని సిఎం కేసీఆర్ డిఎంకె పార్టీ అధినేత స్టాలిన్ను కోరినట్లు సమాచారం. కేసీఆర్ ప్రతిపాదనపై స్టాలిన్ స్పందన ఇంకా తెలియవలసి ఉంది. ప్రస్తుతం డిఎంకె, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొని లోక్సభ ఎన్నికలలో కలిసి పోటీ చేశాయి కనుక కేసీఆర్ ఆహ్వానంపై స్టాలిన్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.