దేశంలో వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని కనుగొనేందుకు సీఓటర్-ఐఏఎన్ఎస్ చేసిన తాజా సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో నెంబర్ 1 సిఎంగా నిలిచారు. రాష్ట్రంలో 20,827 మందిని సిఎం కేసీఆర్ పనితీరుపై ప్రశ్నించినప్పుడు 68.3 శాతం ప్రజలు చాలా సంతృప్తి వ్యక్తం చేయగా, 20.8 శాతం మంది కొంతవరకు సంతృప్తి వ్యక్తం చేశారు. 9.9 శాతం మంది సిఎం కేసీఆర్ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వే నివేదికలో పేర్కొంది.
కేసీఆర్ తరువాత స్థానాలలో వరుసగా హిమాచల్ ప్రదేశ్ సిఎం జైరాం ఠాకూర్, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్, డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. కనీసం 80 శాతం ప్రజలు సంతృప్తి చెందితేనే మంచి పాలన అందించినట్లు చెప్పుకొనే ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడుకి కేవలం 41.7 శాతంతో 14వ స్థానంలో నిలిచారు. ఉత్తరాఖండ్ సిఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఈ జాబితాలో చిట్టచివరి స్థానంలో నిలిచారు.
రాష్ట్రం |
చాలా సంతృప్తి (శాతం) |
కొంత సంతృప్తి (శాతం) |
తీవ్ర అసంతృప్తి (శాతం) |
సర్వేలో పాల్గొన్నవారి సంఖ్య |
తెలంగాణ |
68.3 |
20.8 |
9.9 |
20,827 |
హిమాచల్ ప్రదేశ్ |
58.3 |
25.4 |
15.3 |
8,249 |
ఒడిశా |
55.5 |
26.7 |
17.3 |
19,161 |
డిల్లీ |
51.9 |
28.5 |
18.9 |
9,893 |
ఛత్తీస్ ఘర్ |
43.3 |
22.8 |
8.7 |
15,162 |
బీహార్ |
47.0 |
30.3 |
22.2 |
24,569 |
కర్ణాటక |
36.9 |
35.6 |
25.4 |
15,063 |
ఈశాన్య రాష్ట్రాలు |
34.9 |
27.9 |
16.7 |
2,234 |
పశ్చిమ బెంగాల్ |
39.7 |
32.8 |
26.9 |
23,835 |
అస్సోం |
36.5 |
3507 |
26.8 |
13,175 |
గుజరాత్ |
44.2 |
27.8 |
27.3 |
16,459 |
రాజస్థాన్ |
43.0 |
22.9 |
22.2 |
16,604 |
హర్యానా |
46.4 |
24.1 |
28.9 |
12,347 |
ఆంధ్రప్రదేశ్ |
41.7 |
28.2 |
28.6 |
19,900 |
మధ్యప్రదేశ్ |
42.0 |
20.2 |
21.6 |
19,512 |
మహారాష్ట్ర |
35.0 |
31.5 |
32.6 |
31,928 |
పంజాబ్ |
22.8 |
43.2 |
33.3 |
15,180 |
ఝార్ఖండ్ |
31.0 |
34.1 |
33.4 |
19,620 |
కేరళ |
40.5 |
22.3 |
36.4 |
21,860 |
ఉత్తరాఖండ్ |
25.1 |
36.2 |
36.4 |
14,656 |