రాష్ట్రంలో నాలుగు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట మండలం, నిజామాబాద్ జిల్లాలో వర్ని మండలాన్ని పునర్వ్యవస్థీకరించి మొస్రా, చండూరు అనే రెండు కొత్త మండలాలు, మేడ్చల్ జిల్లాలో మూడు చింతపల్లి అనే మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ నేడు తుది నోటిఫికేషన్ జారీ చేసింది.