బుదవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగియడంతో అత్యంత కీలకమైన పోలింగుకు కౌంట్-డౌన్ మొదలైంది. ఇప్పటి నుంచి సరిగ్గా 36 గంటల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగబోతోంది. కనుక అన్ని పార్టీలు, ఎన్నికల సంఘం, పోలీస్ శాఖల అధికారులు, భద్రతాదళాలు, పోలింగ్ సిబ్బంది అందరూ ఆ కీలక ఘట్టం కోసం సన్నదం అవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్కుమార్ ఎన్నికల ప్రక్రియకు సంబందించిన వివరాలను మీడియాకు తెలియజేశారు.
మొత్తం అసెంబ్లీ స్థానాలు: 119.
పోటీ పడుతున్న అభ్యర్ధులు: 1,821 మంది
ఓటర్ల సంఖ్య: 2,80,64,684 మంది
పోలింగ్ సిబ్బంది సంఖ్య: 1,640, 509.
సహాయ సిబ్బంది: 649 మంది.
పోలింగ్ కేంద్రాలు: 32,815
బ్యాలెట్ యూనిట్లు (ఈవిఎంలు): 55,329,
వివి ఫ్యాట్ యంత్రాలు: 39,763 (ఓటర్లకు రశీదు ఇచ్చే యంత్రాలు)
కంట్రోల్ యూనిట్లు: 39,763
కేంద్ర బలగాలు: 279 కంపెనీలు
రాష్ట్ర భద్రత సిబ్బంది:30,000 మంది
పోలింగు తేదీ: డిసెంబరు 7 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు.
సమస్యాత్మక ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.
ఓట్ల లెక్కింపు: డిసెంబరు 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ముగిసేవరకు.
ఫలితాలు వెల్లడి: డిసెంబరు 11వ తేదీ.