పద్మినీ రెడ్డి నిర్ణయంపై బిజెపి స్పందన

October 13, 2018


img

రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి మొన్న మధ్యాహ్నం బిజెపిలో చెరీ మళ్ళీ రాత్రి కాంగ్రెస్ గూటికి చేరుకోవడంపై బిజెపి చాలా హుందాగానే స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “పద్మినీరెడ్డికి మా పార్టీ పట్ల చా అభిమానం ఉంది కనుకనే మా పార్టీలో చేరుతామంటే సాధారంగా ఆహ్వానించాము. అయితే ఆ తరువాత ఆమెకు ఏమి ఇబ్బంది ఎదురయిందో తెలియదు కానీ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకొన్నారు. మా పార్టీ మహిళలను చాలా గౌరవిస్తుంది. కనుక ఆమె నిర్ణయాన్ని మేము ప్రశ్నించదలచుకోలేదు,” అని అన్నారు.

కిషన్ రెడ్డి చెప్పినట్లు ఆమె బిజెపి అభిమాని కాదు కానీ పరిపూర్ణానంద స్వామి భక్తురాలు. ఆవిదంగా ఆమె బిజెపికు దగ్గరయ్యుండవచ్చు. ఈసారి ఎన్నికలలో ఆమె సంగారెడ్డి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు కనుక ఆ టికెట్ ఆఫర్ చేసినందుకే ఆమె బిజెపిలో చెరీ ఉండవచ్చు. కానీ భర్త, పార్టీ కార్యకర్తల ఒత్తిడితో మనసు మార్చుకొన్నారు. ఈ పరిణామంపై బిజెపి చాలా హుందాగా వ్యవహరించడం హర్షణీయం. 


Related Post