బి.ఎస్.ఎన్.ఎల్. పండుగ ఆఫర్లు

September 23, 2017
img

దసరా, దీపావళి పండుగల సందర్భంగా బి.ఎస్.ఎన్.ఎల్. తన ప్రీ-పెయిడ్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 25 వరకు దేశవ్యాప్తంగా ఈ ఆఫర్లు వర్తిస్తాయని బి.ఎస్.ఎన్.ఎల్. తెలియజేసింది. 

ఈ నాలుగు వారాలలో  రూ.42, 44, 65, 69, 88 మరియు రూ.122 లతో  రీచార్జ్ చేసుకొన్నవారికి 50 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే పైన పేర్కొన్న రీఛార్జ్ లను బి.ఎస్.ఎన్.ఎల్. సగం ధరకే అందిస్తోందన్నమాట. అయితే ఈ ఆఫర్ పొందానికి బి.ఎస్.ఎన్.ఎల్. మొబైల్ యాప్ ద్వారా గానీ దాని అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. రూ.30 రీఛార్జ్ పై ఫుల్ టాక్ కూడా టైం అందిస్తోంది. బి.ఎస్.ఎన్.ఎల్. ప్రకటించిన ఈ ఆఫర్లను గమనిస్తే ఇవి చిన్న చిన్న మొత్తాలను రీఛార్జ్ చేయించుకొనే కాలేజీ విద్యార్ధులు, కార్మికులు, వృద్ధుల కోసం ఉద్దేశ్యించి ఇస్తున్నట్లు కనిపిస్తోంది. రూ.100-700 మద్య ప్లాన్స్ పై కూడా బి.ఎస్.ఎన్.ఎల్. అనేక ఆఫర్లు ఇస్తోంది. వాటిని దాని అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. 


Related Post