తాజా ఆపిల్ సంస్థ తన సరికొత్త మోడల్ ఐ
ఫోన్-8, ఐ ఫోన్-8 ప్లస్ వెర్షన్స్ ను విడుదల చేసింది. వీటి బుకింగ్స్ ఈ నెల 15
నుంచి ప్రారంభం అవుతాయి. ఈనెల 29 నుంచి దేశంలో అన్ని ఆపిల్ షో రూమ్స్ లో
లభిస్తాయి. భారత్ లో దాని ధర రూ.64,000.
ఈ రెండు మోడల్స్ ప్రత్యేకత ఏమిటంటే వైర్-లెస్
చార్జింగ్ చేసుకోవచ్చు. వీటి బ్యాక్ కవర్స్ పగిలిపోని అద్దంతో తయారుచేయబడ్డాయి. అత్యాధునిక
క్యూ-ఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన ఈ అద్దం ద్వారానే ఈ ఫోన్లు ఛార్జింగ్
అవుతాయి. ఈ మోడల్స్ లో ఇంటర్నల్ స్టోరేజ్ కనిష్టంగా 64 జిబి కాగా గరిష్టంగా 256
జిబి ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే! 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్! ఈ రెండు
మోడల్స్ బంగారు, నలుపు మరియు సిల్వర్ కలర్స్ లో లభిస్తాయి. రెంటిలో యాపిల్ 3డి టచ్
సౌకర్యం ఉంది. రెంటిలో అత్యాధునికమైన ఏ-11 బయోనిక్ చిప్ సెట్ ను వినియోగించినందున ఫోన్
లో అన్ని ఫీచర్స్ అత్యంత వేగంగా పనిచేస్తాయి.
ఐ ఫోన్-8 ప్లస్ వివరాలు: దీని ధర: రూ.
77,000. ఈ మోడల్లోనే 64 జిబి ధర: రూ.64,000, 256 జిబి ధర: రూ. 86,000 ఉంటుంది. డిస్
ప్లే: 5.5 అంగుళాలు (ఎల్.సి.డి. రెటినా హెచ్.డి.క్వాలిటీ), ఫ్రంట్ అండ్ రియర్
కెమెరాలు: 12 మెగా పిక్సెల్స్.