ఇప్పటికే అమెజాన్, అమెజాన్ వెబ్సర్వీసస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక అంతర్జాతీయ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టి హైదరాబాద్లో తమ సంస్థలను ఏర్పాటుచేసుకొన్నాయి. తాజాగా అమెరికాకు చెందిన మాస్ మ్యూచువల్ అనే కంపెనీ హైదరాబాద్ రూ.1,000 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. అమెరికా వెలుపల తొలిసారిగా హైదరాబాద్లోనే భారీ పెట్టుబడితో తమ సంస్థను ఏర్పాటు చేస్తోందని ఆ సంస్థ తెలిపింది.
రాష్ట్ర ఐటి శాఖమంత్రి కేటీఆర్ కూడా ఈ విషయం దృవీకరిస్తూ ట్వీట్ చేశారు. “అమెరికాలో టాప్ 500 కంపెనీలలో ఒకటైన మాస్ మ్యూచువల్ కంపెనీ హైదరాబాద్లో తమ సంస్థను ఏర్పాటు చేయడంతో ఈ వారం శుభారంభమైంది. ఆ సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ను ఏర్పాటుచేయబోతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను,” అని ట్వీట్ చేశారు.