హైదరాబాద్ మహానగర ప్రజలకు ఆర్టీసీ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్లో నిత్యం విద్య, ఉద్యోగాల నిమిత్తం లక్షలాదిమంది ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేస్తుంటారు. నిత్యం ప్రయాణించేవారి కోసం టీఎస్ఆర్టీసీ వివిధ కేటగిరీలవారీగా బస్ పాసులు ఇస్తుంటుంది. హైదరాబాద్ మహానగర పరిధిలో బస్ పాసులు తీసుకునేవారు సుమారు 9-10 లక్షల మంది ఉంటారని అంచనా. వాటిని ఏడాదికి ఒకసారి బస్ స్టేషన్ వెళ్లి రెన్యువల్ చేసుకోవాల్సి ఉండేది. కానీ అందుకు చాలా సమయము వృధా అవుతుందనే ఉద్దేశ్యంతో ఇళ్ళ వద్దనే బస్ పాస్ రెన్యువల్ సౌకర్యం కల్పించనుంది. బస్ పాస్ రెన్యువల్ చేసుకునే వారు ఒకే ప్రాంతంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమండి ఉన్నట్లయితే ఆర్టీసీ సిబ్బంది వారి కాలనీ వద్దకు వచ్చి బస్సు పాసులు రెన్యూవల్ చేసి ఇస్తారు. ఈ సదుపాయానికి ఎలాంటి అదనపు రుసుము చెల్లించి అవసరంలేదు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే ఫోన్ నెంబర్: 80082 04216 సంప్రదించాలని టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ రీజియనల్ మేనేజర్ తెలిపారు.