హైదరాబాద్లో ఆర్టీసీ బస్ పాసులు కలిగినవారికి ఉపశమనం కలిగించే వార్త ఇది. లాక్డౌన్ సమయంలో బస్ పాసులను వినియోగించుకోలేకపోయినవారికి ఆ మేరకు కొత్త బస్ పాసులను ఇవ్వబోతున్నట్లు టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ ప్రకటించింది. ఒకవేళ నెలరోజులకు పాస్ తీసుకొని లాక్డౌన్ సమయంలో బస్సులు తిరుగని కారణంగా పాసులను వినియోగించుకోలేకపోతే ఆ నెలరోజులను మళ్ళీ ఇప్పుడు వినియోగించుకొనేందుకు వీలుగా కొత్త బస్ పాసులను ఇస్తామని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీఎస్ఆర్టీసీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, ఎయిర్పోర్ట్ పుష్పక్ ఏసీ బస్ సర్వీసులకు ఇది వర్తిస్తుందని ప్రకటనలో తెలియజేసింది. కనుక లాక్డౌన్ సమయంలో బస్ పాసులను వినియోగించుకోలేకపోయినవారు నవంబర్ 30వ తేదీలోగా తమ బస్ పాసులను, ఐడీ కార్డులను సమీపంలోని బస్ పాస్ కౌంటర్లలో అందజేసి కొత్త బస్ పాసులను పొందవచ్చని టీఎస్ఆర్టీసీ తెలియజేసింది.