దసరాదీపావళి పండుగల సందర్భంగా రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 39 ప్రత్యేక రైళ్ళను నడిపించబోతోంది. వాటిలో నాలుగు రైళ్ళు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో తిరుగుతాయి. లింగంపల్లి-కాకినాడ, సికింద్రాబాద్-హౌరా సమీపంలోని షాలిమార్, సికింద్రాబాద్-విశాఖపట్టణం, విశాఖపట్టణం-తిరుపతి మద్య ఈ రైళ్ళు నడుస్తాయి. త్వరలోనే ఇవి ప్రారంభం అవుతాయని రైల్వేశాఖ ప్రకటించింది. ఇవేకాక దేశవ్యాప్తంగా మరో 35 ప్రత్యేక రైళ్లు కూడా నడిపిస్తామని రైల్వేశాఖ ట్విట్టర్ ద్వారా ఇవాళ్ళ తెలియజేసింది. ప్రత్యేక రైళ్ళ వివరాలు: