రైల్వే ప్రయాణికులకు శుభవార్త

September 16, 2020
img

లాక్‌డౌన్‌ కారణంగా గత ఆర్నెల్లుగా నిలిచిపోయిన రైళ్లు మళ్ళీ పట్టాలెక్కి పరుగులు తీస్తుండటంతో ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. అన్‌లాక్‌-4లో భాగంగా రైల్వేశాఖ ఇప్పటివరకు ప్రకటించిన రైళ్ళకు అదనంగా ఈ నెల 21 నుంచి మరో 20 జతల ప్రత్యేక క్లోన్ రైళ్ళు నడిపించబోతున్నట్లు ప్రకటించింది. అయితే వీటిని ఎక్కువ డిమాండ్ ఉన్న మార్గాలలో మాత్రమే నడిపించబోతున్నట్లు ప్రకటించింది. వీటిలో ప్రయాణించేందుకు 10 రోజుల ముందుగా మాత్రమే రిజర్వేషన్లు చేసుకోవచ్చు. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ రైళ్ళకు రిజర్వేషన్లు ప్రారంభం అవుతాయని తెలిపింది. ఈ క్లోన్ రైళ్ళు పరిమిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని రైల్వేశాఖ తెలిపింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ళతో పోలిస్తే ఈ క్లోన్ రైళ్ళు మరికొంచెం ఎక్కువ వేగంగా కూడా ప్రయాణిస్తాయని తెలిపింది. ఈ నెల 21 నుంచి నడువబోతున్న క్లోన్ రైళ్ళ వివరాలు, టైమ్ టేబిల్: 


Related Post