తెలంగాణ నుంచి ఉద్యోగ, వ్యాపారారీత్యా దుబాయ్ వెళ్ళివచ్చేవారు వేల సంఖ్యలో ఉన్నారు. కనుక దుబాయ్-హైదరాబాద్ మద్య వారానికి మూడు ఫ్లైట్స్ నడిపించేందుకు ఎయిర్ అరేబియా సంస్థ ఫ్లై దుబాయ్ విమానయాన సంస్థతో ఒప్పందం చేసుకొంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, విస్తారా, ఒమన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాలు హైదరాబాద్-దుబాయ్ మద్య తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఫ్లై దుబాయ్ కూడా చేరడంతో హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్ళివచ్చేవారికి మరింత సౌకర్యం ఏర్పడినట్లయింది. అయితే కరోనా కారణంగా అంతర్జాతీయ విమానసేవలపై కేంద్రప్రభుత్వం నిషేదం ఎత్తివేసిన తరువాతే ఫ్లై దుబాయ్ సేవలు కూడా ప్రారంభం అవుతాయి.