తెలంగాణలో 500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న పిరమాల్ గ్రూప్

January 23, 2020
img

ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ బృందం అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో వరుసగా సమావేశమవుతూ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 

అక్కడ వారు భారత్‌లోని ప్రముఖ ఫార్మాకంపెనీ పెరిమాల్ గ్రూప్ అధినేత అజయ్ పెరిమాల్‌తో సమావేశమయ్యి హైదరాబాద్‌ శివార్లలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ గురించి, పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించి రాష్ట్రంలో పరిశ్రమను స్థాపించవలసిందిగా కోరారు. అజయ్ పిరిమాల్ సానుకూలంగా స్పందిస్తూ, రాగల 3 సం.లలో రూ.500 కోట్లు పెట్టుబడితో పెరిమాల్ ఫార్మా కంపెనీని ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా 1,400 మందికి, పరోక్షంగా మరో 600 మంది వరకు ఉద్యోగాలు, ఉపాది అవకాశాలు లభిస్తాయి.  


Related Post