అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం భారత్లోని తెలంగాణ రాష్ట్రాల మద్య సిస్టర్ స్టేట్ పార్ట్నర్షిప్ ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ నగరంలో లోయర్ ట్యాంక్బండ్ వద్ద గల మారియట్ హోటల్లో బుదవారం ఐసిసి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఐటిశాఖమంత్రి కేటీఆర్ సమక్షంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్మర్ఫీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కె జోషి ఈ ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో ఐటి, మీడియా, డాటా సెంటర్స్, క్లీన్ ఎనర్జీ, హెల్త్ కేర్, ఉన్నత విద్య, ఫార్మా, లైఫ్ సైన్సస్, బయోటెక్, ఫిన్టెక్, పర్యాటకం, సాంస్కృతిక మొదలైన రంగాలలో న్యూజెర్సీ- తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటాయి.
ఈ సందర్భంగా ఫిలిప్మర్ఫీ మీడియాతో మాట్లాడుతూ, “మా ఈ పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు చాలా అనుకూలమైన వాతావరణం కనిపించింది. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో తెలంగాణ రాష్ట్రం చాలా ముందంజలో ఉంది. కనుక పరస్పరం సహకరించుకొంటూ వివిద రంగాలలో అభివృద్ధి సాధిస్తామనే నమ్మకం మాకుంది,” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, రాష్ట్ర ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, హైదరాబాద్లోని అమెరికన్ కౌన్సిలెట్ అధికారులు పాల్గొన్నారు.