ఏటిఎం వినియోగదారులకు ఓ శుభవార్త

August 15, 2019
img

ఏటిఎం వినియోగదారులకు ఓ శుభవార్త! ఇకపై ఏటిఎంలలో నగదు లావాదేవీలు చేస్తున్నప్పుడు, ఏ కారణం చేతైనా అవి పూర్తికానట్లయితే, ఆ లావాదేవీలను లెక్కించరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుదవారం దేశంలో అన్ని బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత లావాదేవీల పరిమితి తరువాత ఏటిఎంలలో నగదు లేకపోవడం, సాంకేతిక కారణాల వలన విఫలమైన లావాదేవీలను కూడా బ్యాంకులు లెక్కగట్టి వినియోగదారుల నుంచి ఛార్జీలు పిండుకొంటున్నాయి. వాటికి రిజర్వ్ బ్యాంక్ అడ్డుకట్ట వేసింది. గ్రామీణ బ్యాంకులతో సహా దేశంలో అన్ని బ్యాంకులకు ఈ ఆదేశం వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. 

       


Related Post