తెలుగు న్యూస్ ఛానల్స్ లో నూతన ఒరవడిని ప్రవేశపెట్టిన ఘటన టీవీ-9కి దాని సీఈఓ రవి ప్రకాష్ కే దక్కుతుంది. ఇటీవల టీవీ-9 సంస్థను అలంద మీడియా అనే సంస్థ టేక్ ఓవర్ చేసింది. అప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయి. బోర్డు డైరెక్టర్ల నియామకానికి రవి ప్రకాష్ అడ్డుపడుతున్నారని, ఇటీవల తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని అలంద మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం ఉదయం నుంచి హైదరాబాద్లోని రవి ప్రకాష్ నివాసంలో టీవీ-9 కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం రవి ప్రకాష్ విదేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఆయనను విచారణకు హాజరుకావలసిందిగా కోరినట్లు సమాచారం.
ఈ ఆరోపణ నేపధ్యంలో టీవీ9లో 90 శాతం వాటా కలిగిన అలంద మీడియా రవి ప్రకాష్ ను సీఈఓ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.