రెండు గంటల్లో ఫిరోజ్‌గూడలో రైల్వే ట్రాక్ ఏర్పాటు

January 17, 2019
img

సనత్ నగర్ నుంచి మౌలాలి వరకు సాగుతున్న ఎంఎంటీఎస్ రెండో దశ పనులలో భాగంగా రైల్వే అధికారులు ఫిరోజ్‌గూడ వద్ద రెండవ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేశారు. ట్రాక్ ఏర్పాటు కోసం రైల్వే అధికారులు రెండు భారీక్రేన్లు, అవసరమైన ఇతర పరికరాలు, సిబ్బందిని అన్నీ ముందే ఏర్పాటు చేసుకొనడంతో మంగళవారం అర్ధరాత్రి పనులు మొదలుపెట్టి కేవలం రెండు గంటలలోనే రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసేశారు. మరొక ఆరు నెలలో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తి చేస్తామని రైల్వే అధికారులు చెప్పారు. 


Related Post