ఆ సీట్లో కూర్చోంటే రూ.500 జరిమానా

October 23, 2018
img

హైదరాబాద్‌ మెట్రో రైల్లో ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది కానీ ఇక నుంచి వృద్ధులు, వికలాంగులు, మహిళలకు కేటాయించిన సీట్లలో పురుషులు కూర్చోంటే మాత్రం రూ.500 చెల్లించుకోవలసిందే. మెట్రో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్‌ రెడ్డి సోమవారం రసూల్ పూరా వద్ద గల మెట్రోభవన్‌లో మెట్రో, ఎల్‌అండ్‌టీ సంస్థల అధికారులతో సమావేశమైనప్పుడు ఈ నిర్ణయం తీసుకొన్నారు. దీనిని అమలుచేసేందుకు మెట్రో ప్రతీబోగీలో సిబ్బందిని నియమించాలని ఎల్‌అండ్‌టీ సంస్థ అధికారులను కోరారు. అదేవిధంగా మెట్రోలో మహిళల భద్రతపై ఫిర్యాదుల కోసం ఒక మొబైల్ యాప్ ను కూడా రూపొందించాలని కోరారు.


Related Post