సిరిపూర్ పేపర్ మిల్స్ కార్మికులకు శుభవార్త

June 20, 2018
img

ఆదిలాబాద్ సిరిపూర్ పేపర్ మిల్స్ త్వరలో మళ్ళీ తెరుచుకోనుంది. ఆ సంస్థను నడిపించేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వపరంగా అన్ని విధాల సహాయసహకారాలు, ప్రోత్సాహకాలు ఇస్తామని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించడంతో ప్రముఖ పేపర్ ఉత్పత్తి సంస్థ జెకె పేపర్ మిల్స్ సంస్థ సిరిపూర్ పేపర్ మిల్స్ ను నడిపించడానికి ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆ సంస్థకు సిరిపూర్ పేపర్ మిల్స్ అప్పగించే ప్రక్రియ చురుకుగా సాగుతోంది. అది పూర్తవగానే సిరిపూర్ పేపర్ మిల్స్ తెరుచుకుంటుంది. గతంలో ఆ సంస్థలో పనిచేసిన కార్మికులు, ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. సంస్థ స్వాధీన ప్రక్రియ పూర్తవడానికి మరొక రెండు-మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. సిరిపూర్ పేపర్ మిల్స్ ఉత్పత్తి ప్రారంభిస్తే సుమారు 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.   


Related Post