ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త సీఈఓగా సందీప్ భక్షి నియమితులయ్యారు. ఇంతకు ముందు ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓగా వ్యవహరించిన చందా కోచార్ అవినీతి ఆరోపణలు రావడంతో బ్యాంక్ విచారణ జరుపుతోంది. కనుక అది పూర్తయ్యేవరకు ఆమెను దీర్గకాలం శలవుపై వెళ్ళవలసివచ్చింది.
ప్రస్తుతం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కు ఎండీగా, సీఈవోగా పనిచేస్తున్న సందీప్ భక్షిని ఐసిఐసిఐ బ్యాంక్ బోర్డు ఆమె స్థానంలో సీఈఓగా నియమించింది. నేటి నుంచే ఆయన ఐసిఐసిఐ బ్యాంక్ సీఈఓగా భాద్యతలు చేపడతారని బోర్డు ఒక ప్రకటన ద్వారా తెలిపింది. కనుక నేటి నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ కు సబందించి అన్ని వ్యవహారాలను ఆయనే చూస్తారు.