టాలెంట్ ఉంటే బ్యాక్ గ్రౌండ్ తో పనేంటి..!

August 17, 2019


img

అడివి శేష్ హీరోగా వెంకట్ రాంజీ డైరక్షన్ లో పివిపి బ్యానర్ లో వచ్చిన సినిమా ఎవరు. అడివి శేష్, రెజినా, నవీన్ చంద్ర లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ఆగష్టు 15న రిలీజై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో పాటే రిలీజైన రణరంగం సినిమా పెద్దగా మెప్పించలేదని తెలుస్తుంది. ఇక ఎవరు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటుచేశారు.    

ఈ సక్సెస్ మీట్ కు అటెండ్ అయిన దిల్ రాజు అడివి శేష్ ప్రై ప్రశంసల వర్షం కురిపించాడు. నిర్మాతగా తనకు కథల విషయంలో జడ్జ్ మెంట్ ఉంటుంది. కాని అడివి శేష్ ట్విస్టులకు జడ్జ్ మెంట్ చేయలేను. అందుకే త్వరలో అడివి శేష్  తో సినిమా చేయాలని అనుకుంటున్నా అన్నారు దిల్ రాజు. ఇక సినిమా పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు వస్తాయని అనుకునే వారికి అడివి శేష్ ద్వారా టాలెంట్ ఉంటే బ్యాక్ రౌండ్ లేకుండా ఛాన్సులు వస్తాయని ప్రూవ్ అయ్యిందని అన్నారు. ప్రస్తుతం తను రెండు సినిమాల కమిట్మెంట్ ఉన్నాడు. అవి పూర్తి కాగానే అడివి శేష్ తో తన సినిమా ఉంటుందని అన్నారు దిల్ రాజు.    



Related Post

సినిమా స‌మీక్ష