కథ చెప్పేందుకు సిద్ధమా..!

May 22, 2018


img

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి కాంబినేషన్ లో సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి ఒకే వేదిక మీద కనబడితేనే అరుపులు పెట్టే అభిమానులు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహలకు అందట్లేదు. కథ చెప్పకుండానే ఇద్దరి కాంబినేషన్ లో మూవీ ఫిక్స్ చేసిన రాజమౌళి కథ చెప్పేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నాడట.

ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమా చేస్తున్న రాం చరణ్ ఇటీవల బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాడు. కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ తదుపరి షెడ్యూల్ మొదలు పెడతారట. ఇక ఈ గ్యాప్ లో రాజమౌళి చరణ్ కు మల్టీస్టారర్ కథ చెప్పేందుకు డిసైడ్ అయ్యాడట. ఓ పక్క త్రివిక్రం సినిమా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుండగా తారక్ కూడా ఓ టూ డేస్ షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి ఈ కథ వినాలని నిర్ణయించుకున్నాడట. మొత్తానికి రాజమౌళి మల్టీస్టారర్ కథ వినేందుకు ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు ఈగర్ గా ఉన్నారని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష